సుఖరోగం
1)సుఖరోగము అనగా నేమి ?
సుఖరోగము అనేది అసురక్షిత లైంగిక సంపర్కం వలన ట్రపనీమా పారిడమ్ అను సూక్ష్మజీవి వల్ల సంక్రమించే జబ్బు.2)ప్రజలకు ఇది ఏ విధంగా సోకుతుంది ?
ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సుఖవ్యాధి పుండుతో నేరుగా సంపర్కం కలగడం మూలంగా వ్యాపిస్తుంది. ఈ పుండ్లు ముఖ్యంగా పురుషాగం, బాహ్య జననేంద్రియాలు, యోని మరియు మూత్రాశయం పై ఏర్పడుతాయి. ఈపుండ్లు పెదవులమీద మరియు నోటి లోపలి భాగంలో కూడా ఏర్పడవచ్చు. సూక్ష్మజీవి యోని, ఆసనము లేదా
నోటి సంభోగం ద్వారా వ్యాప్తి చెందుతుంది. గర్భస్ధశిశువుకు వ్యాప్తి చేసే అవకాశం వుంటుంది. ఈ సుఖరోగం ఈ
క్రింది కారణాల వల్ల వ్యాప్తి చెందదు.
- ఒకే మల మూత్రవిసర్జన స్థలం ఉపయోగించడం మూలంగా
- తలుపు గడియలు
- ఈత కొలనులు
- భోజనానికి ఒకే కంచాలు వాడడం. స్నానాల తొట్టి, బట్టలు వంటివి వ్యాధి గ్రస్తులైన వారితో పంచుకొన్నప్పుడు వ్యాధి సొకే ప్రమాదం వుండదు.
3)యౌవనంలో వున్న వారిలో కనపడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి ?
ఈ వ్యాధి గ్రస్థులైన వారిలో చాలా సం,, వరకూ లక్షణాలు కనబడవు.ప్రాధమిక దశ : సుఖ రోగం యొక్క ప్రాధమిక దశలో ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ పుండ్లు ఎక్కువ శాతం
జననేంద్రియాలు పై కనబడుతాయి. రోగి వ్యాధి ,సంక్రమించిన దినం నుంచే మొదట లక్షణం అంటే పుండ్లు వంటివి
బయటబడడానికి ముందు సాధారణంగా చిన్నగా, గుండ్రంగా గట్టిగా నొప్పి లేనిదిగా వుంటుంది. ఇవి సుఖరోగం
శరీరంలో ప్రవేశించిన కేంద్రంలో ఏర్పడుతాయి. ఇవి 3 నుంచి 6 వారాల వరకూ వుండి వాటంతటవే మానిపోతాయి.
కానీ కొన్ని సందర్భాలలో రోగ నిరోధక శక్తిని బట్టి ఒకవేళ తగు విధంగా చికిత్స తీసుకోని పక్షంలో సోకిన వ్యాధి
రెండవ దశకు చేరుకుంటుంది.
రెండవ దశ : చర్మంపైన దద్దుర్లు, శ్లేష్మపొర పై ఏర్పడే పుండ్లు లేక దద్దర్లుతో ఈ రెండవ దశ గుర్తింపబడుతుంది.
దద్దర్ల లో సాధారణంగా దురద వుండదు. ఈ దద్దర్లు ఎఱ్ఱగా, ఎరుపు తో కూడిన గోధుమ వర్గంలో మచ్చలలాగా
అరికాళ్ళలో అరచేతులలో కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలలో శరీరంలో వేరే భాగంలో వేరే వ్యాధులలో
కనిపించే దద్దుర్ల వంటివి కూడా కనిపించవచ్చు. దద్దుర్లులే కాకుండా సుఖరోగం రెండవ దశలో జ్వరం, శోషరస
గ్రంధుల వాపు, గొంతులోని శ్లేష్మపొర మీద క్షతము లేదా రాపిడి (వాడుక భాష గొంతు పూయడం) తలపై
అక్కడక్కడా మచ్చలగా జుట్టురాలిపోవడం, తలనొప్పి, బరువుతగ్గడం, కండరాల నొప్పి మరియు అలసత్వం వంటి
లక్షణాలు కూడా కనబడుతాయి.
అంతర్గతంగా వున్నదశ: రెండవ దశ లక్షణాలు కనుమరుగయిన తరువాత అంతర్గతదశ మొదలవుతుంది.
అవసాన దశలో ఈ సుఖరోగం క్రమక్రమంగా అంతర్గతంగా మెదడు, నరాలు, కళ్ళు, గుండె, రక్తనాళాలు,
కాలేయము, ఎముకలు మరియు కీళ్ళు, మొదలగు అవయవాలకు అపాయం (హాని) కలిగిస్తుంది. ఈ
అంతర్గతంగా జరిగే హాని కొన్ని సం. తరువాత బయట పడవచ్చు. అంతర్గత దశలోని చిహ్నాలు లక్షణాలు ఈ క్రింది
విధంగా వుంటాయి.
- వివిధ కండరాల కదలికలలో సమన్వయ లోపం
- పక్షవాతం
- తిమ్మిరులు
- క్రమంగా వృధిచెందే అంధత్వం
- మతిభ్రంశము
4)సుఖరోగం గర్భిణి స్త్రీని గర్భస్థశిశువును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది.?
పరిణామాలు వుంటాయి. ఈ కాలం అధికంగా వుంటే మృత శిశువు జన్మించేంతట తీవ్రపరిణామం కూడా
జరుగవచ్చు. లేదా పుట్టిన కొద్ది సమయం లోనే శిశువు మృతి చెందవచ్చు. వ్యాధి సంక్రమించి శిశువులో ఏ
సంకేతాలు, లక్షణాలు లేక పోవచ్చును. తక్షణమే చికిత్స అందించని యొడల శిశువులో తీవ్రమైన ఆరోగ్య
సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది చికిత్స అందని శిశువులకు పెరుగుదలలో మైలురాయిలు ఆలస్యం
కావచ్చును. కొన్ని సార్లు మూర్ఛరోగం, మరణం కూడా సంభవించవచ్చును.
5)సుఖరోగానికి హెచ్.ఐ.వి.కు ఉన్న సంభంధం ఏమిటి?
వివాహేతర సంబందాలకు దూరంగా వుండడం. ఖచ్చితంగా ఈ వ్యాధి సోకకుండా కాపాడుతుంది. అసురక్షిత సంభోదాలకు దూరంగా వుండాలి. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు కూడా లైంగిక ప్రేరేపణలకు కారణమవుతాయి. కాబట్టి దీనికి కూడా దూరంగా వుండడం ఎంతైనా ఉవసరం.
No comments:
Post a Comment